చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం పారకాల్వ గ్రామంలోని ప్రజలు ఈగల బెడదతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఈగల ద్వారా వచ్చే వ్యాధులతో నానా అవస్థలు పడుతున్నారు. ఎన్ని మందులు చల్లినా వాటి నుంచి విముక్తి లభించడం లేదని వాపోతున్నారు. అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశామని వారి నుంచి ఇప్పటికి స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈగల వల్ల పిల్లలు, పెద్దలు జ్వరాల బారిన పడుతున్నారని... ఆనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లితే కరోనా పరీక్షలు చేసుకున్నాకే రమ్మంటున్నారని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా జీవననే అందోళనకరంగా మారిందని పేర్కొన్నారు.
అదే కారణం..