ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 7, 2020, 10:58 PM IST

ETV Bharat / state

స్థల వివాదం... తహసీల్దార్​కు గ్రామస్థుల వినతి పత్రం

గ్రామ కంఠానికి చెందిన భూమిలో రైతు భరోసా కేంద్రం, పాల సేకరణ కేంద్రం నిర్మించడానికి అధికారులు యత్నిస్తున్నారంటూ విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతలపేట గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని అడ్డుకోవాలంటూ తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

chintalapeta villagers
chintalapeta villagers

పూర్వం నుంచి తమ ఆధీనంలో భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతలపేట గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రం, పాల సేకరణ కేంద్రానికి గ్రామ కంఠానికి చెందిన స్థలాన్ని తీసుకోవటం అన్యాయమన్నారు. తమకు న్యాయం చేయాలంటూ సోమవారం గుర్ల పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మండల తహసీల్దార్ లావణ్యకు వినతిపత్రం అందించారు. తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details