ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2020, 12:09 PM IST

ETV Bharat / state

బండరాళ్లు కొడుతూ వ్యక్తి మృతి... ఇద్దరికి గాయాలు

చిత్తూరు జిల్లా కలకడలో విషాదం జరిగింది. బండ రాళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు అది తగిలి ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

one man killed and two were injured while crushing stone at kalakada in chittor district
కలకడలో బండరాళ్లు కొడుతుండగా వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లా కలకడ మండలంలో విషాదం జరిగింది. మండలంలోని నడిమిచర్ల పరిధి మొటుకు గ్రామంలో బండ రాళ్లు కొడుతుండగా ఒకరు మృతిచెందారు. ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఇంటి పనులకోసం బండ రాళ్లను కొడుతుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు రెహమాన్, గాయపడిన వారు ముబారక్, అక్బర్​లుగా గుర్తించారు. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details