ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 13, 2021, 4:45 AM IST

Updated : Apr 13, 2021, 6:41 AM IST

ETV Bharat / state

నూతన సంవత్సరాదికి శ్రీవారి సన్నిధి ముస్తాబు.. నేడు ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీ వారి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది పండగను వైభవంగా నిర్వహించడానికి తితిదే ఏర్పాట్లు చేసింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీవారి సుప్రభాత సేవతో కార్యక్రమాలు మెుదలయ్యాయి.

ఉగాదికి శ్రీవారి సన్నిధి ముస్తాబు
ఉగాదికి శ్రీవారి సన్నిధి ముస్తాబు

తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేళ... తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయంతో పాటు ప‌రిస‌రాలను ఫ‌ల, పుష్పాల‌తో అందంగా అలంక‌రించారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీవారి సుప్రభాత సేవతో కార్యక్రమాలు మెుదలవుతాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య ఉగాది ఆస్థానం నిర్వహించున్నారు. సాయంత్రం తిరుమల నాలుగు మాడవీధుల్లో ఉభయ దేవరుల సమేతంగా శ్రీ మలయప్ప స్వామి బంగారు పల్లకిపై ఊరేగుతూ..భక్తకోటికి అనుగ్రహించనున్నారు.

ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని తితిదే ఉద్యాన‌వ‌న విభాగం రంగురంగుల పుష్పాలతో అలంకరించింది. ఆధ్వర్యంలో 8 టన్నుల పువ్వులు, 70 వేల‌ కట్ ఫ్లవ‌ర్స్‌ ఉపయోగించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిపుణులైన కళాకారులు.... పుష్పాలంకరణలో పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా తితిదే శ్రీవారి ఆర్జీత సేవలను మంగళవారం రద్దు చేసింది. ఉదయం 7గంటల నుంచి 9 వరకు ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఆలయ ఆస్థాన సిద్ధాంతి పంచాంగ పఠనం చేయనున్నారు.

Last Updated : Apr 13, 2021, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details