ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NTR TRUST: కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత - NTR Trust

చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వాసుపత్రికి (kuppam govt hospital) ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR trust) ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్ (oxygen plant) అందించారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (TDP leader chandrababunaidu) ఆదేశాలతో రూ.45 లక్షలు వ్యయం చేసి.. ప్లాంటును అందుబాటులోకి తెచ్చారు.

కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత
కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత

By

Published : Jul 15, 2021, 4:35 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి ఎన్టీఆర్ ట్రస్ట్ వితరణతో... ఆక్సిజన్ ప్లాంట్​ను అందించారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రూ.45 లక్షల వ్యయంతో ప్లాంట్ ను అందుబాటులోకి తెచ్చారు.

ఈ క్రమంలో ఇవాళ కుప్పం చేరుకున్న ఆక్సిజన్ ప్లాంట్ కు తెదేపా కార్యాలయం వద్ద పూజలు చేసి పట్టణంలో ఊరేగించారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేతలు అభ్యంతరం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details