ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

19ఎర్ర చందనం దుంగలు స్వాధీనం... తమిళనాడు వాసి అరెస్ట్ - News on red sandal smugling

శేషాచల అటవీప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 19 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు వాసిని అరెస్ట్‌ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. ఆర్‌ఎస్‌ఐ వాసు తన సిబ్బందితో శ్రీవారిమెట్టు నుంచి కూంబింగ్‌ నిర్వహించారన్నారు. శుక్రవారం ఉదయం భాకరాపేట సమీపంలోని జగమాలకొండ ప్రదేశంలోని నల్లగుట్ట ప్రాంతంలో సుమారు 20 మంది ఎర్ర స్మగ్లర్లు దుంగలు మోసుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. మిగిలిన 19 మంది పరారయ్యారు.

news on red sandal illigalt transport in seshachalam
ఎర్రచందనం స్మగ్లింగ్

By

Published : Sep 5, 2020, 8:19 AM IST

శేషాచల అటవీప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం భాకరాపేట ఫారెస్ట్ లో టాస్క్ ఫోర్స్ అధికారుల కూంబింగ్ చేపట్టారు. ఓ తమిళనాడుకు చెందిన స్మగ్లర్​ను అరెస్ట్ చేసి, 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 700 కేజీల బరువు గల 19 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.20 లక్షలు ఉంటుందని డీఎస్పీ రవిశంకర్ వెల్లడించారు. స్మగ్లర్లు సహజ సంపదను మూర్ఖంగా నరికి వేస్తున్నారని, పట్టుబడితే శిక్షలు కఠినంగా ఉన్నా వెనుకాడడం లేదని టాస్క్ఫోర్స్ డీఎస్పీ రవిశంకర్ అన్నారు.

భాకరాపేట నుంచి తలకోన వరకు అటవీశాఖ, టాస్క్ఫోర్స్ అధికారులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ రవిశంకర్ తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పిడితే శిక్షలు కఠినంగా ఉంటాయని తెలిసి కూడా స్మగ్లర్లు మూర్ఖంగా బరితెగిస్తున్నారని చెప్పారు. సుమారు20 మంది స్మగ్లర్లు అధికారుల రాకను పసిగట్టి రాళ్ల దాడికి పాల్పడ్డారని అన్నారు. వారిని వెంబడించి ఓక స్మగ్లర్ ను అరెస్ట్ చేశామన్నారు. పరారైన స్మగ్లర్ల కోసం విస్తృతంగా గాలింపులు చేపట్టామని చెప్పారు.

ఇదీ చదవండి: నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details