వైఎస్ఆర్ ఆశయాలను సాధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కృషి చేస్తున్నారని మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలోని తారకరామ మైదానంలో చిత్తూరు జిల్లాకు కేటాయించిన 108,104 వాహనాలను ప్రారంభించారు. అనంతరం నగరంలో వాహనాల ర్యాలీ నిర్వహించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చి.... తర్వాత నిలిచిపోయిన అత్యవసర సేవల సర్వీసులును.... సీఎం జగన్మోహన్రెడ్డి పునరుద్ధరించారన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.
'వైఎస్ఆర్ ఆశయాలను సాధించేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి'
వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాలను సాధించేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు కేటాయించిన నూతన 104, 108 వాహనాలను తిరుపతి వేదికగా.. వారు ప్రారంభించారు.
నూతన 104స 108 వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రులు