ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓ కుమార్తె అదృశ్యం.. ఫిర్యాదు పట్టించుకోలేదంటూ తల్లీ, కూతురు ఆత్మహత్యాయత్నం - కుమార్తె అదృశ్యంపై పోలీసులు పట్టించుకోలేదని గుడుపల్లిలో తల్లీ, కూతుళ్ల ఆత్మహత్యాయత్నం

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో తల్లీ, కుమార్తెలు విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. మరో మైనర్ కూతురు అదృశ్యంగా కాగా.. తమ ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు.

mother and daughter suicide attempt in gudupalli mandal
గుడుపల్లి మండలంలో తల్లీ కూతురు ఆత్మహత్యాయత్నం

By

Published : Feb 13, 2021, 6:15 PM IST

తమ కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ.. ఓ తల్లి మరో కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో వారిరువురూ విషం తాగారు. బాధితులను స్థానికులు కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు నిరసన చేపట్టాయి.

గుడుపల్లి మండలంలో తల్లీ కూతురు ఆత్మహత్యాయత్నం

కుప్పంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్న 16 ఏళ్ల బాలిక నాలుగు రోజుల కిందట అదృశ్యమైంది. ఈ విషయంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలిక తల్లి ఆరోపించింది. మరో కుమార్తెతో పాటు ఆమె విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.

ఇదీ చదవండి:కూతురికి ఓటేసి.. కన్నుమూసిన తండ్రి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details