తమ కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ.. ఓ తల్లి మరో కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో వారిరువురూ విషం తాగారు. బాధితులను స్థానికులు కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు నిరసన చేపట్టాయి.
ఓ కుమార్తె అదృశ్యం.. ఫిర్యాదు పట్టించుకోలేదంటూ తల్లీ, కూతురు ఆత్మహత్యాయత్నం - కుమార్తె అదృశ్యంపై పోలీసులు పట్టించుకోలేదని గుడుపల్లిలో తల్లీ, కూతుళ్ల ఆత్మహత్యాయత్నం
చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలంలో తల్లీ, కుమార్తెలు విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. మరో మైనర్ కూతురు అదృశ్యంగా కాగా.. తమ ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు.
![ఓ కుమార్తె అదృశ్యం.. ఫిర్యాదు పట్టించుకోలేదంటూ తల్లీ, కూతురు ఆత్మహత్యాయత్నం mother and daughter suicide attempt in gudupalli mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10612445-256-10612445-1613216334928.jpg)
గుడుపల్లి మండలంలో తల్లీ కూతురు ఆత్మహత్యాయత్నం
గుడుపల్లి మండలంలో తల్లీ కూతురు ఆత్మహత్యాయత్నం
కుప్పంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్న 16 ఏళ్ల బాలిక నాలుగు రోజుల కిందట అదృశ్యమైంది. ఈ విషయంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలిక తల్లి ఆరోపించింది. మరో కుమార్తెతో పాటు ఆమె విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
ఇదీ చదవండి:కూతురికి ఓటేసి.. కన్నుమూసిన తండ్రి