ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరారీలో ఉన్న ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు - తిరుపతిలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

ఎర్రచందనం అక్రమ రవాణాలో... ఆరితేరిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరూ తిరుపతి శివారు ప్రాంతాల్లో తలదాచుకుని ఉన్నట్లు కనుగొన్నామని టాస్క్ ఫోర్స్ ఇంఛార్జీ శ్రీరవి శంకర్ తెలిపారు.

most wanted redsandal smugglers arrested in tirupathi
పరారీలో ఉన్న ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

By

Published : Jun 26, 2020, 12:50 PM IST

ఎర్రచందనం అక్రమ రవాణాలో.. ఆరితేరిన ఇద్దరు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై వివిధ పోలీసు స్టేషన్‌లలో కేసులు ఉన్నాయని టాస్క్ ఫోర్స్ ఇంఛార్జీ శ్రీరవి శంకర్ తెలిపారు. ఇద్దరూ తిరుపతి శివారు ప్రాంతాల్లో తలదాచుకుని ఉన్నట్లు కనుగొన్నామని చెప్పారు. వీరిని వెనుబాక్కం సుదర్శన్ ఎలియాస్ శ్రీనివాస్, గుండాల శంకర్ ఎలియాస్ పచ్చోడు (35)లుగా గుర్తించామని వివరించారు.

వీరిలో సుదర్శన్ పై ఎర్రచందనం అక్రమ రవాణాలో 64 కేసులు ఉన్నాయని, చిత్తూరు, కడప జిల్లాలలో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లని తెలిపారు. 13 కేసుల్లో నిందితునిగా ఉన్న గుండాల శంకర్ తిరుపతిలో ఆటో డ్రైవర్​గా చెలామణి అవుతూ... పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నాడని తెలిపారు. విచారణ కోసం సుదర్శన్‌ను శ్రీసిటీ పోలీస్ స్టేషన్​కు, శంకర్‌ను రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్​కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details