ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

KUPPAM ELECTION: కుప్పంలో ప్రలోభాల పర్వం.. ఓటుకు రూ.5వేలు! - కుప్పంలో డబ్బుల పంపిణీ వార్తలు

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం సాగుతోంది. పురపాలిక పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార, విపక్షాలు ముమ్మర ప్రయత్నాలు చేపట్టాయి. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు పంపిణీ చేస్తున్నారని కుప్పం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మణి ఆరోపించారు.

Kuppam
Kuppam

By

Published : Nov 14, 2021, 9:17 AM IST

చిత్తూరు జిల్లాలోని కుప్పం పురపాలిక పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఎత్తుగడలో ప్రలోభాల పర్వం సాగుతోంది. ఒక్కో నాయకుడికి ఒక్కో వార్డు బాధ్యతలను సంబంధిత పార్టీ అప్పగించింది. ఓటర్లకు డబ్బుల పంపిణీ బాధ్యతలు స్థానికేతరులకు ఇచ్చింది. శనివారం ఉదయం నుంచే ఆ పార్టీ కార్యకర్తలు కొందరు సర్వేల పేరిట, ఓటరు స్లిప్పులు పంపిణీ చేయడానికి ఇళ్లకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు పంపిణీ చేస్తున్నారని కుప్పం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మణి ఆరోపించారు. ఇప్పటికే కొంత (రూ.1500) పంపిణీ చేయగా.. ఎన్నిక రోజున కొంత ఎక్కువగా (రూ.2వేలు) ఇస్తున్నట్టు సమాచారం. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప శనివారం ప్రాథమిక పాఠశాలలో ప్రచారం చేశారు. అక్కడే ఓ మహిళా వాలంటీర్‌.. వైకాపా అభ్యర్థిని గెలిపించాలని కోరడం గమనార్హం. సోమవారం ఈ పాఠశాలలోనే పోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఓటుతో సమాధానం చెప్పండి: చంద్రబాబు
‘హలో.. నేను మీ చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నా..’ అంటూ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లకు శనివారం తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మాటలు రికార్డు చేసిన స్వరం సందేశంగా వచ్చింది. కుప్పంలో అలజడి సృష్టించేందుకు బయటివారు వచ్చారని, వారికి ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. వైకాపా దుష్టశక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుప్పంతో ఉన్న బంధాన్ని వేరు చేయలేరని చెప్పారు. తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించారు. వైకాపా ప్రభుత్వం తనపై ఉన్న కోపాన్ని కుప్పంపై చూపుతోందన్నారు. రెండున్నరేళ్లుగా కుప్పంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు.

రెండు ఓట్లను వేయించేలా..
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓ పార్టీ నేతలు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. రెండు వార్డుల్లోనూ ఓటు ఉన్న వ్యక్తులను గుర్తించి, తమకు అనుకూలంగా ఉన్న వారితో రెండు ప్రాంతాల్లోనూ వారితో ఓటు వేయించేలా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తిరుపతి ఎన్నిక సమయంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో కూడా కొందరు ఓటర్లకు డబ్బు, చీరలు పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.

దొంగ ఓట్లకు యత్నిస్తున్నారు: తెదేపా
స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిలీ గుర్తింపు కార్డుల సాయంతో బయటవ్యక్తులతో దొంగఓట్లు వేయించే కుట్ర జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెదేపా ఫిర్యాదు చేసింది. తిరుపతి ఉపఎన్నిక మాదిరిగానే.. ఇక్కడా అనుసరిస్తున్నారంటూ పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబు ఎస్‌ఈసీ నీలం సాహ్నీకి లేఖ రాశారు.

ఇదీ చదవండి

HIGH COURT ON KUPPAM: ఇప్పుడు ప్రచారానికి.. రేపు నామినేషన్​కా?

ABOUT THE AUTHOR

...view details