ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 17, 2021, 10:09 AM IST

ETV Bharat / state

ప్రధాని మోదీ, సీఎం జగన్​కు కృతజ్ఞతలు: రోజా

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధగా ఉందని ఆమె అన్నారు.

ప్రధాని మోదీ, సీఎం జగన్​కు కృతజ్ఞతలు: రోజా
ప్రధాని మోదీ, సీఎం జగన్​కు కృతజ్ఞతలు: రోజా

చిత్తూరు జిల్లా నగరిలో కొవిడ్-19 వ్యాక్సినేషన్​ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్​కు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

చిత్తూరులో...

చిత్తూరు నగరంలోని మూడు ప్రాంతాల్లో కొవిడ్-19 వ్యాక్సిన్​ను ఆరోగ్య సిబ్బందికి వేశారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, అపోలో మెడికల్ కాలేజీ, ఆర్వీఎస్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేసే ప్రక్రియను ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించారు. వ్యాక్సిన్ వేసిన అరగంట పాటు అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో ఉంచి పరిశీలనలో పెట్టారు.

ఇదీ చదవండి:

కొవిన్ పోర్టల్​ ఇంతలా ఉపయోగపడుతుందా?

ABOUT THE AUTHOR

...view details