ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తోపుడు బండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. రోడ్డు బ్లాక్ చేసి ర్యాలీ! - today MLA Madhusudan Reddy criticism on social media news update

వైకాపా రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అయితే.. కరోనా వ్యాప్తి ఇప్పటికీ ఉద్ధృతంగా ఉన్న తరుణంలో.. ఇలా రోడ్లు బ్లాక్ చేసి, ర్యాలీగా కార్యక్రమం నిర్వహించడం ఏంటని.. కొందరు విమర్శిస్తున్నారు.

MLA Madhusudan Reddy
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తోపుడు బండ్లు పంపిణీపై విమర్శలు

By

Published : May 31, 2021, 10:47 AM IST

వైకాపా రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. తోపుడు బండ్ల పంపిణీ చేపట్టారు. కార్యక్రమం మాటెలా ఉన్నా.. నిర్వహించిన తీరు మాత్రం విమర్శలపాలైంది. కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా అదుపు కాని ప్రస్తుత పరిస్థితుల్లో.. రోడ్డును బ్లాక్ చేసి, 100కు పైగా తోపుడు బండ్లతో ర్యాలీగా చేసిన తీరుపై.. స్థానికులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details