చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన వైకాపా నాయకులు, అభ్యర్థుల సమావేశంలో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. పుత్తూరు మున్సిపాలిటీలో 27 వార్డులను గెలిపించుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని... ఎమ్మెల్యే రోజా సోదరుడు రామ్ప్రసాద్ రెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను అధిగమించి.. విజయం సాధించాలని కోరారు.
'పుత్తూరు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో గెలవాలి' - MLA Korumutla Srinivasan latest news
ఎమ్మెల్యే ఆర్.కే.రోజా ప్రజల మనిషిగా గుర్తింపు పొందారని కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు కొనియాడారు. నగరిలో.. పుత్తూరు మున్సిపల్ ఎన్నికలపై వైకాపా నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
!['పుత్తూరు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో గెలవాలి' MLA Korumutla Srinivasan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10802350-995-10802350-1614428375312.jpg)
పుత్తూరు మున్సిపల్ ఎన్నికలపై ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు సమావేశం
Last Updated : Feb 27, 2021, 7:06 PM IST