ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 14, 2020, 5:47 PM IST

ETV Bharat / state

అమర జవాను కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయలను అందజేసింది. జవాను స్వగ్రామానికి వెళ్లి మంత్రులు... ప్రవీణ్ కుమార్ భార్యకు చెక్కు ఇచ్చారు.

jawan praveen kumar reddy family
jawan praveen kumar reddy family

అమర జవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి 50లక్షల రూపాయల చెక్కును మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి అందించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు వెళ్లి ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి భార్యకు చెక్కు అందజేశారు. జవాను కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలం, సాగుభూమి ఇచ్చేందుకు పరిశీలిస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details