ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో ఎమ్మెల్యే పార్థసారథి సైతం పాల్గొన్నారు. రామతీర్థానికి తిరుపతి నుంచి విగ్రహాలు తరలించినట్లు వెల్లంపల్లి వెల్లడించారు. బాలాలయం ఏర్పాటు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

By

Published : Jan 23, 2021, 9:20 AM IST

minister vellam
minister vellam

తిరుమల శ్రీవారిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న వారికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. తితిదే నుంచి సీతారాముల విగ్రహాలను రామతీర్థానికి తరలించామని.. బాలాలయం ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్ఠిస్తామని మంత్రి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details