ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగితే.. ప్రజల విలువ తెలిసేది: పెద్దిరెడ్డి - Minister Peddireddy Ramachandra Reddy Latest News

ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగితే ప్రజల విలువ తెలిసేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు. తన పేరు మీద గెలిచిన నేతలంతా ఇళ్లల్లో కూర్చుని ప్రజలను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

By

Published : May 21, 2021, 3:57 PM IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు జిల్లా పుంగనూరులో స్థానిక వైకాపా ప్రతినిధులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్​తో కలిసి పుంగనూరులోని కొవిడ్ ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి.. సొంత నియోజకవర్గంలో రోగులకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ అందుతున్న మౌలిక సదుపాయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. సొంత పార్టీ నేతలపైనే మండిపడ్డారు.

ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగితే ప్రజల విలువ తెలిసేదన్న మంత్రి.. తన పేరు మీద గెలిచిన నేతలంతా ఇళ్లల్లో కూర్చుని ప్రజలను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పలువురి పనితీరు బాగాలేదన్న మంత్రి.. ఇకనైనా తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

ఇదీ చదవండీ... కరోనాకు ఆయుర్వేద మందు.. తిరిగి పంపిణీకి సన్నాహాలు

ABOUT THE AUTHOR

...view details