ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దయచేసి మమ్మల్ని స్వరాష్ట్రాలకు పంపండి' - చిత్తూరు జిల్లా మదనపల్లెలో బిహార్ ఝార్ఖండ్​కు చెందిన వలస కూలీలు

తమను సొంత రాష్ట్రాలకు పంపించడానికి చర్యలు తీసుకోవాలని... బిహార్, ఝార్ఖండ్​కు చెందిన వలస కార్మికులు విజ్ఞప్తి చేశారు. గత నెల రోజులుగా తమను ఎవరూ పట్టించుకోవట్లేదని వాపోయారు. చిత్తూరు జిల్లా మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.

migrant labours dharnaa at madanapalle chittore district
మదనపల్లెలో వలస కార్మికుల ధర్నా

By

Published : May 5, 2020, 3:53 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లె మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద... బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల వలస కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమను స్వరాష్ట్రాలకు పంపే ఏర్పాట్లు చేయాలని అధికారులను వేడుకున్నారు. 4 రోజులుగా తాము పస్తులుంటున్నామని వాపోయారు. ఈనెల ఒకటో తారీఖున స్వస్థలాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నామని... ఇప్పటివరకూ తహసీల్దార్ కార్యాలయం నుంచి అనుమతి రాలేదని చెప్పారు. ఉపాధి కోసం మదనపల్లె వచ్చామని... వివిధ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నామని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా పనులు జరగట్లేదని.. దయచేసి తమను స్వగ్రామాలకు పంపాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details