ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 18న తిరుపతి మేయర్, ఉపమేయర్ ఎన్నిక: నగర పాలక కమిషనర్ - తిరుపతి మున్సిపల్ ఎన్నికలు

తిరుపతి నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను ఈ నెల 18 న నిర్వహించనున్నట్లు నగర పాలక కమిషనర్ గిరీషా ప్రకటించారు. తిరుపతి శాసనసభ్యులు...ఎక్స్ అఫిషియో సభ్యులుగా మేయర్ ఎన్నికల్లో పాల్గొంటారని ఆయన వివరించారు.

మాట్లాడుతున్న తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీషా
మాట్లాడుతున్న తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీషా

By

Published : Mar 14, 2021, 4:39 PM IST

తిరుపతి నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను ఈ నెల 18న నిర్వహించనున్నట్లు నగరపాలక కమిషనర్ గిరీషా ప్రకటించారు. తిరుపతి నగరానికి కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఆయన వెల్లడించారు. 50 వార్డులకు గాను 22 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయని.. 27 డివిజన్లకు పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఏకగ్రీవాలు, ఎన్నికలు జరిగిన డివిజన్లలో వైకాపా 48, తెదేపా ఒక డివిజన్​లో విజయం సాధించినట్లు కమిషనర్ తెలిపారు. తిరుపతి శాసన సభ్యులు... ఎక్స్ అఫిషియో సభ్యులుగా మేయర్ ఎన్నికలో పాల్గొంటారని వివరించారు.

ఇదీ చదవండి:ప్రజలు జగన్​మోహన్ రెడ్డిని ఆదరించారు: ఆర్కే రోజా

ABOUT THE AUTHOR

...view details