ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థులకు మాస్కుల పంపిణీ

By

Published : Dec 4, 2020, 6:11 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలోని కస్తూర్బా పాఠశాలలో... పోర్డు సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. కరోనా నియంత్రణ చర్యల గురించి అవగాహన కల్పించారు.

kasturi ba school
కస్తూరిబా బాలికల పాఠశాలలో విద్యార్థులకు మాస్కుల పంపిణీ

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు, షాంపూలు పంపిణీ చేశారు. తంబళ్లపల్లె పోర్డు సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేప్టటారు. ఆరోగ్యం, పరిశుభ్రతపై బాలికలకు అవగాహన కల్పించారు. కరోనా నివారణ కోసం చైతన్య కార్యక్రమాలు చేపట్టినట్లు సంస్థ కన్వీనర్ ఆవుల నరసింహులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details