ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆఖరి సమావేశంలో ఆస్తి పన్నుపై చర్చ - చిత్తూరు జిల్లా మదనపల్లె

మదనపల్లి పట్టణ ప్రజలకు ఆస్తిపన్ను భారం తగ్గించడానికి... పాలకపక్షం చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ చివరి సమావేశం... చైర్మన్ కొడవలి శ్రీప్రసాద్ అధ్యక్షతన శనివారం జరిగింది.

మదనపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం

By

Published : Jun 29, 2019, 8:21 PM IST

Updated : Jun 30, 2019, 12:05 AM IST

మదనపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం

చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లా చేయాలంటూ పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. వైకాపా ప్రభుత్వం.. గతంలో ఒక్కో లోక్​సభ నియోజకవర్గాన్ని జిల్లాను చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్నిమున్సిపల్ వైస్ చైర్మన్ భవాని ప్రసాద్ గుర్తు చేశారు. ఈ అంశాన్ని మిగిలిన కౌన్సిలర్లు బలపరిచి... ప్రభుత్వానికి కౌన్సిల్ తీర్మానం ద్వారా తెలియజేయాలని కోరారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ... వారివారి వార్డుల్లో సమస్యలను ప్రస్తావించారు. ప్రధానంగా తాగునీటి సరఫరాపై చర్చించారు.

Last Updated : Jun 30, 2019, 12:05 AM IST

ABOUT THE AUTHOR

...view details