ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం - thirupathi sri kodandarama swamy temple

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం నిర్వహించారు. కొవిడ్ వ్యాప్తి కారణంగా ఈ ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించారు.

pushpayagam in thirupathi
తిరుపతి శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం

By

Published : Apr 20, 2021, 1:41 AM IST

తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఏకాంతంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం శాస్త్రోక్తంగా జరిగింది.

తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ప‌త్రాల‌తో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించారు. రాష్ట్రంతో పాటు త‌మిళ‌నాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పుష్పాలను అందించారు. పుష్పయాగం అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగ‌ణంలో ఊరేగించారు.

ఇదీచదవండి.

పోలవరం హెడ్​రెగ్యులేటర్ వద్ద ఎత్తిపోతల పథకానికి అనుమతులు జారీ

ABOUT THE AUTHOR

...view details