ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 30, 2020, 12:12 PM IST

ETV Bharat / state

శ్రీకాళహస్తిలో కార్తిక శోభ.. బారులు తీరిన భక్తజనం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తిక శోభను సంతరించుకుంది. కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులు ఆలయానికి బారులు తీరారు. ఆలయ ఆవరణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

karthika masam prayers at srikalahasthi
karthika masam prayers at srikalahasthi

కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తిక శోభతో విరాజిల్లుతోంది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వర్ణముఖి నదిలో స్నానాలు ఆచరించి ఆలయ ఆవరణంలో కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.

భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీకాళహస్తి
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీకాళహస్తి
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీకాళహస్తి

ABOUT THE AUTHOR

...view details