ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రులు

By

Published : Jul 16, 2021, 1:56 PM IST

తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం కర్ణాటక మంత్రులు దర్శించుకున్నారు. కర్ణాటక మంత్రులకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Karnataka_Ministers_At_Darshan_
కర్ణాటక మంత్రులు

తిరుమల శ్రీవారిని కర్ణాటక మంత్రులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శనం ప్రారంభ సమయంలో మంత్రులు ఈశ్వరప్ప, విశ్వనాధం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కాసేపు స్వామి సేవలో తరించారు. కర్ణాటక మంత్రులకు తితిదే అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మంత్రులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details