సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై.. రాజద్రోహం కేసులో అరెస్టైన జడ్జి రామకృష్ణను చిత్తూరు జిల్లా జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో.. జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణకు.. జైలు అధికారులు సమాచారమిచ్చారు. చిత్తూరు జిల్లా జైలులో తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ వంశీకృష్ణ.. రెండు రోజుల కిందట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
Judge Ramakrishna: పీలేరు సబ్ జైలుకు జడ్జి రామకృష్ణ తరలింపు
చిత్తురు జిల్లా జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు జడ్జి రామకృష్ణను తరలించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. రాజద్రోహం కేసులో జడ్జి రామకృష్ణ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
judge ramakrishna