ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 1, 2020, 2:58 PM IST

ETV Bharat / state

వైకాపా ప్రభుత్వం కాపులకు చేసిన మేలేంటి: జనసేన నాయకులు

కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందంటూ... జనసేన నాయకులు ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం కాపులకు చేసిన మేలేంటని వారు తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు.

janasena followers fires on ycp in kapu reservation issue in tirupathi
వైకాపాపై మండిపడ్డ జనసేన నాయకులు

కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందంటూ... తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం కాపులకు చేసిన మేలేంటని ప్రశ్నించారు. రూ.4700 కోట్లు కాపులకు అందించామని మంత్రి అవంతి చెప్పటాన్ని వారు తప్పుపట్టారు. ఎక్కడెక్కడ ఎవరెరికి ఆ నిధులను కేటాయించారో శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను విమర్శించటానికి కాపు మంత్రులనే రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తుందని ఆరోపణలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details