ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 5, 2021, 12:12 PM IST

ETV Bharat / state

తిరుమల అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం

తిరుమల మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదంలో సజీవ దహనమైన మల్లిరెడ్డి ప్రమాదానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో పోలీసులు గుర్తించారు. ఇది ప్రమాదమా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.

tirumala fire
తిరుమల అగ్ని ప్రమాదం

తిరుమల అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన మల్లిరెడ్డిది ప్రమాదమా? లేక ఆత్మహత్యా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రమాదానికి గంట ముందు చరవాణీని తన మిత్రుడికి మల్లిరెడ్డి ఇచ్చాడని.. అందులో ఓ సెల్ఫీ వీడియోను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిన్న జరిగిన తిరుమల అగ్ని ప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధం కాగా లక్షల్లో నష్టం వాటింలింది.

ABOUT THE AUTHOR

...view details