ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ సహకార సంఘాలకు నూతన ఛైర్మన్లు

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో వ్యవసాయ సహకార సంఘాలకు కొత్త పాలక వర్గాలను నియమించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కొత్త సభ్యులను ఎన్నుకున్నారు.

By

Published : Jul 31, 2019, 3:59 PM IST

బాధ్యతలు స్వీకరిస్తున్న పాలకవర్గం సభ్యులు

బాధ్యతలు స్వీకరిస్తున్న పాలకవర్గం సభ్యులు

పీలేరు నియోజకవర్గంలో వ్యవసాయ సహకార సంఘాల త్రిసభ్య కమిటీకి పాత పాలకవర్గానికి పదవీకాలం ముగియడంతో కొత్త పాలక వర్గాన్ని నియమించారు. ఈ మేరకు మదనపల్లె సహకార డివిజన్ రిజిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పీలేరు మండల సింగిల్ విండో చైర్మన్​గా బీడీ నారాయణరెడ్డి, కలికిరికి రెడ్డివారి వెంకట్ రెడ్డి, వాల్మీకిపురం రామకృష్ణారెడ్డి, గుర్రంకొండ వెంకటశివారెడ్డి, కలకడ కమలాకర్ రెడ్డి, కేవీపల్లి మండలానికి శివశంకర్​రెడ్డి సింగిల్ విండో చైర్మన్​గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పంట రుణాలు త్వరితగతిన మంజూరు చేస్తామన్నారు. బ్యాంకు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details