ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొండవాడలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - illegal transport of ration seazed latest news

చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని తొండవాడ సమీపంలో... విజిలెన్స్ అధికారులు వాహనాలను తనీఖీ చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి చిత్తూరు జిల్లా గుడిపాలకు వస్తున్న లారీని తనీఖీ చేయగా... 17టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

illegal transport of ration seazed in chittor district
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Aug 21, 2020, 11:53 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని తొండవాడ సమీపంలో విజిలెన్స్ అధికారులు 17 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ మల్లీశ్వర్ రెడ్డికి అందిన సమాచారంతో అప్రమత్తమైన యంత్రాంగం... నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి చిత్తూరు జిల్లా గుడిపాలకు వస్తున్న లారీని వెంబడించారు. తొండవాడ సమీపంలో లారీని అడ్డుకుని తనిఖీ చేయగా 17 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details