ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tirumala: శ్రీవారి సన్నిధిలో సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ - తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

Bellamkonda visited Tirumala: కలియుగ దైవమైన తిరుమల శ్రీవారిని సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం నటుడికి... ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Bellamkonda visited Tirumala
Bellamkonda visited Tirumala

By

Published : Jan 3, 2022, 11:34 AM IST

Bellamkonda visited Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటుడు సాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నటుడికి... ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని బెల్లంకొండ శ్రీనివాస్‌ తెలిపారు. తన పుట్టిన రోజు కావడంతో తిరుమలకు వచ్చానని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేళ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నా పుట్టిన రోజు. అందుకే తిరుమలకు వచ్చాను. నూతన సంవత్సర వేళ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించాను.-బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సినీ నటుడు

శ్రీవారి సన్నిధిలో సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

ఇదీ చదవండి:TIRUMALA: నూతన సంవత్సర వేళ.. శ్రీవారి సేవలో ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details