మహాశివరాత్రిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు . అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలతో ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రమంత్రి గౌతమ్రెడ్డి - మేకపాటి గౌతమ్ రెడ్డి తాజా వార్తలు
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శ్రీకాళహస్తిశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించిన రాష్ట్రమంత్రి గౌతమ్రెడ్డి