'కిరీటాల అపహరణపై దర్యాప్తు ' - ttd ccso
తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో మాయమైన కిరీటాల కోసం 5 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని సీవీఎస్ వో గోపీనాథ్ జెట్టి తెలిపారు.
కిరీటాల అపహరణ
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల అపహరణపై దర్యాప్తు చేస్తున్నామని తితిదే సీవీఎస్వో గోపినాథ్ జెట్టి స్పష్టం చేశారు. 2 కిరీటాల కోసం 5 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై తమకు కొన్నే ఆధారాలు లభించాయని, మరికొన్ని లభ్యం కావాల్సి ఉందని పేర్కొన్నారు.