ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 24, 2021, 10:36 PM IST

ETV Bharat / state

వకుళమాత ఆలయంలో బంగారు తాపడం పనులు ప్రారంభం

చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు బండపై చేపట్టిన వకుళమాత ఆలయ పునర్నిర్మాణ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ గర్భగుడిలో బంగారు తాపడం పనులను ప్రారంభించారు.

vakulamatha temple in tirupati rural
వకుళ మాత ఆలయంలో బంగారు తాపడం పనులు ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి.. వకుళమాత ఆలయాన్ని నిర్మించే అదృష్టాన్ని ఆ శ్రీనివాసుడే నాకు కల్పించాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు బండపై ఆలయ పునర్నిర్మాణ పనులను టీటీడీ ఆధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆలయ గర్భగుడిలో బంగారు తాపడం పనులను పూజలు చేసి ప్రారంభించారు.

వకుళ మాత ఆలయంలో బంగారు తాపడం పనులు ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

ఆలయ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని... మరో నెల రోజల్లో పూర్తి కావచ్చని మంత్రి తెలిపారు. వకుళమాత ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా భాసిల్లుతుందని వెల్లడించారు.

ఇదీచూడండి:మూడేళ్ల తరువాత 'మిథాని' పనుల్లో మళ్లీ కదలిక

ABOUT THE AUTHOR

...view details