చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పెన్నలపాడులో ఊయల మెడకు బిగుసుకుని బాలిక మృతి చెందింది. గ్రామానికి చెందిన జానకి ఊయల ఊగుతుండగా పొరపాటున అది మెడకు బిగుసుకుంది. దాంతో ఊపిరాడక చిన్నారి మరణించింది. పాప మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఊయలే ఉరితాడై... బాలిక మృతి - ఊయల ఊగుతూ బాలిక మృతి
సరదాగా ఊయల ఊగుతున్న పాప అది మెడకు బిగుసుకుని మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పెన్నలపాడులో జరిగింది. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారి మరణంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
![ఊయలే ఉరితాడై... బాలిక మృతి girl died because of hammock at pennalapadu chittore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6818755-920-6818755-1587046044247.jpg)
ఊయల బిగుసుకుని మృతిచెందిన బాలిక