ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు - coombing in thalakona forest news

చిత్తూరు జిల్లాలోని యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన అడవులలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఇరవై తొమ్మిది ఎర్రచందనం దుంగలతో పాటు తమిళ స్మగ్లర్​ను అదుపులోకి తీసుకున్నారు.

red sandalwood seized
ఎర్రచందనం స్వాధీనం

By

Published : Feb 16, 2021, 4:15 PM IST

చిత్తూరు జిల్లా తెరపదడి ప్రాంతంలో 29 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక తమిళ స్మగ్లర్​ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన అడవులలో చేపట్టిన కూంబింగ్​లో 30 మంది తమిళ స్మగ్లర్లు ఎర్రచందనం తెస్తూ అధికారుల కంటపడ్డారు. అధికారులను చూసి దుంగలను పడేసి స్మగ్లర్లు అడవిలోకి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భాకరాపేట అటవీశాఖ అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details