చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో తమినాడుకు చెందిన స్మగ్లర్ల ఆగడాలు ఆగటం లేదు. అటవీ శాఖ అధికారులు నిరంతరం కూంబింగ్ చేపడుతున్నా... వారి రాకను అరికట్టలేకపోతున్నారు. యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన శేషాచల అడవులలో సోమవారం రాత్రి నిర్వహించిన కూబింగ్లో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది స్మగ్లర్లు పారిపోగా... వారి కోసం అదనపు బలగాలతో శేషాచల అడవులను జల్లెడపడుతున్నట్లు భాకరాపేట ఎఫ్.ఆర్.ఓ పట్టాభి తెలిపారు. ఈ కూబింగ్లో పాల్గొన్న ఎఫ్.ఎస్.ఓ నాగరాజను, ఎఫ్.బి.ఓ వందనకుమార్ను బేస్ క్యాంపు సిబ్బందిని ఆయన అభినందించారు.
32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం... ఇద్దరు అరెస్ట్ - red sandal smugglers arrest news\
చిత్తూరు జిల్లా యార్రావారిపాళ్యం మండలంలోని తలకోన శేషాచలం అడవుల్లో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది పారిపోగా వారి కోసం గాలిస్తున్నారు.
![32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం... ఇద్దరు అరెస్ట్ red sandal wood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9329198-1063-9329198-1603796056437.jpg)
red sandal wood