ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషపూరితమైన ఆహారం తిని ఐదు నెమళ్లు మృతి..! - చిత్తూరు తాజా వార్తలు

విషపూరితమైన ఆహారం తిని ఐదు నెమళ్లు మృత్యువాత పడ్డాయి. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. నెమళ్ల పొట్టలోని అవశేషాలను తిరుపతి పశువైద్యశాలలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

విషపూరితమైన ఆహారం తిని ఐదు నెమళ్లు మృతి
విషపూరితమైన ఆహారం తిని ఐదు నెమళ్లు మృతి

By

Published : Sep 16, 2021, 7:37 AM IST

చిత్తూరు జిల్లా కలికిరి మండలం నరావాండ్లపల్లె సమీపంలోని రాగిమానికుంట వద్ద బుధవారం ఐదు నెమళ్లు మృతి చెందాయి. అటవీ, పశువైద్యశాఖల అధికారులు, వైద్యులు సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వాటిని కలికిరి రెడ్డివారిపల్లెలోని పశువైద్యశాలకు తరలించి సర్పంచి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, గ్రామస్థుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. నెమళ్ల పొట్టలోని అవశేషాలను తిరుపతి పశువైద్యశాలలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. అనంతరం కళేబరాలపై జాతీయజెండాను కప్పి నివాళి అర్పించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. విషపూరితమైన ఆహారం తినడం వల్లే అవి చనిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details