తిరుమలలో ఆస్థానమండపంలోని దుకాణ సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో శ్రీవారి చిత్ర పటాలు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే వేగంగా మంటలు ఇతర షాపులకు వ్యాపించారు.. ఈ ఘటనలో 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. శకలాలు తొలగిస్తుండగా షాపు నెం.84లో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిలిందని అగ్నిమాపక, తితిదే విజిలెన్స్ అధికారులు అంచనా వేశారు. ఆగ్నిప్రమాదంతో తాము నిండా మునిగి పోయామని బాధితులు వాపోయారు.
తిరుమలలో అగ్నిప్రమాదం... ఒకరు సజీవదహనం
తిరుమలలోని ఆస్థాన మండపం వద్దనున్న దుకాణాల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధం కాగా.. ఒకరు సజీవదహనమయ్యారు.
fire-accident-in-tirumala
Last Updated : May 4, 2021, 12:28 PM IST