ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు

చిత్తూరు జిల్లాలో నకిలీ విత్తనాలు పంపిణీ చేస్తున్న దళారులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దళారులు రైతుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి సీడ్ ఏజెన్సీలకు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారు.

By

Published : May 6, 2019, 1:26 PM IST

Updated : May 10, 2019, 7:23 AM IST

చిత్తూరు జిల్లాలో నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు

చిత్తూరు జిల్లాలో నకిలీ విత్తనాల కుంభకోణం వెలుగుచూసింది. జిల్లా విజిలెన్స్ అధికారులు నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు చేశారు. రైతుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి సీడ్ ఏజెన్సీలకు విత్తనాలు పంపిణీ చేస్తున్న దళారులను గుర్తించారు. 2017-18 రబీ సీజన్ కు నకిలీ వేరుశనగ విత్తనాలను వీరు పంపిణీ చేశారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన 13కోట్ల రాయితీని స్వాహా చేశారన్నారు. ఈ కుంభకోణంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని ఎస్పీ రాధాకృష్ణ చెప్పారు.

చిత్తూరు జిల్లాలో నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు
Last Updated : May 10, 2019, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details