ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 31, 2021, 9:44 AM IST

ETV Bharat / state

"బలవంతపు ఏకగ్రీవాలను ఉపేక్షించం"

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవాలకు తెదేపా అడ్డురాదని, సరైన పద్ధతిలో ఏకగ్రీవాలు జరిగితే ఆహ్వానిస్తామని తెదేపా సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పురసారత్నం తెలిపారు. అలాగే బలవంతపు ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదని ఆయ స్పష్టం చేశారు.

వెదురుకుప్పంలో ఎన్నికల సరళిని అడిగి తెలుకుంటున్న మాజీ మంత్రి
వెదురుకుప్పంలో ఎన్నికల సరళిని అడిగి తెలుకుంటున్న మాజీ మంత్రి

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, కార్వేటినగరం, శ్రీరంగరాజపురం మండలాల్లో నామినేషన్ల ప్రక్రియను మాజీ మంత్రి పరసారత్నం, తెదేపా అధికార ప్రతినిధి ఎన్​.బి సుధాకర్ పరిశీలించారు. వెదురుకుప్పంలో నామినేషన్ల సరళి గురించి ఎస్సై లోకేశ్వర్ రెడ్డి నుంచి వివరాలు తెలసుకున్నారు. మాజీ మంత్రి మాట్లాడుతూ...చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి అభ్యర్థులకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details