ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 11, 2020, 8:39 AM IST

ETV Bharat / state

డిప్యూటేషన్లపై పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల్లో ఆరోపణలపై విచారణ

విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూటేషన్లపై పని చేస్తోన్న ఉపాధ్యాయుల బదిలీల్లో వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. విద్యశాఖాధికారి కార్యాలయంలో పర్యవేక్షకులు, ఉద్యోగులను విచారించారు. నివేదికను పాఠశాల విద్యా శాఖ కమిషనర్​కు అందజేయనున్నట్లు పాఠశాల విద్యా శాఖ ఆర్జేడీ వెంకట కృష్ణా రెడ్డి వెల్లడించారు.

enquiry on deputation
enquiry on deputation

చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూటేషన్లపై పని చేస్తోన్న ఉపాధ్యాయుల బదిలీల్లో అధికారులు, ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాల విద్యా శాఖ ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. మొదట జిల్లా విద్యాశాాఖాధికారి కార్యాలయంలో పర్యవేక్షకులు, ఉద్యోగులను విచారించారు.

అనంతరం డీఈవో నరసింహ రెడ్డి, సహాయ సంచాలకులు అనితా రోస్ రాణి, పురుషోత్తంలను విచారించారు. వారు చెప్పిన సమాధానాలను నమోదు చేసుకున్నారు. విచారణ పూర్తి చేసి నివేదికను పాఠశాల విద్యా శాఖ కమిషనర్​కు అందజేయనున్నట్లు పాఠశాల విద్యా శాఖ ఆర్జేడీ వెంకట కృష్ణా రెడ్డి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details