ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు ఎన్నికల శిక్షణ - చంద్రగిరి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు

చంద్రగిరి మండలంలో 121 పోలింగ్ కేంద్రాల్లో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నట్లు ఎంపీడీవో రాధమ్మ చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

election training
చంద్రగిరి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు శిక్షణ కార్యక్రమం

By

Published : Feb 18, 2021, 4:44 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను ఎంపీడీవో రాధమ్మ కోరారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో స్టేజ్-2 రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

చంద్రగిరి మండలంలో 121 పోలింగ్ కేంద్రాల్లో చివరిదశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. సమస్యాత్మకమైన గ్రామపంచాయతీల ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎంపీడీవో అన్నారు. మొత్తం 353 మంది స్టేజ్ -2 అధికారులు చివరి దశ పోలింగ్ లో పాల్గొంటారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details