ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు: ఎస్పీ

చిత్తూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎన్నికల సజావుగా సాగేందుకు కావాల్సిన ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకున్నామని పేర్కొన్నారు.

By

Published : Apr 10, 2019, 10:21 PM IST

చిత్తూరు జిల్లాలో పోలింగ్ భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

చిత్తూరు జిల్లాలో పోలింగ్ భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. . రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చిత్తూరు జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తం 5వేల 732 మంది పోలీసులు ఎన్నికల విధులను పర్యవేక్షిస్తుండగా ఇప్పటికే 14వేల 500మంది రౌడీలపై ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 700 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన పోలీసు అధికారులు...వాటి వద్ద అదనపు బలగాలు మోహరించారు. 408 రూట్ మొబైల్స్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతారవణంలో జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామంటున్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్.

ABOUT THE AUTHOR

...view details