ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భూమి నుంచి భారీ శబ్దాలు...పరుగులు తీసిన జనం

By

Published : Dec 1, 2020, 12:01 AM IST

చిత్తూరు జిల్లా కాప్పల్లి, బైరాజుపల్లి గ్రామాల్లో భూమి నుంచి భారీ శబ్దాలు రావటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. భూమి కదిలినట్లు శబ్దాలు వస్తుండడంతో గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాప్పల్లి గ్రామానికి చెందిన చంద్రప్ప అనే వ్యక్తి ఇంటి గోడలు పగుళ్లు రావటంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.

Earth moved in chittoor
Earth moved in chittoor

భయంతో బయటకు పరుగులు తీసిన జనం

చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం కాప్పల్లి, బైరాజుపల్లి గ్రామాలలో భూమి నుంచి శబ్దాలు రావటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భూమి కదిలినట్లు శబ్దాలు రావటం వల్ల ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సోమవారం తెల్లవారు జాము నుంచి శబ్దాలు వస్తున్నాయని గ్రామస్థులు అంటున్నారు. కాప్పల్లి గ్రామంలో చంద్రప్ప అనే వ్యక్తి ఇంటి గోడలకు పగుళ్లు రావటం వల్ల గ్రామస్థులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. భూగర్భ శాస్త్రవేత్తలను పంపి పరిశీలిస్తామని రామసముద్రం తహసీల్దార్‌ తెలిపారు.

గోడలకు ఏర్పడ్డ పగుళ్లు
గోడలకు ఏర్పడ్డ పగుళ్లు

ABOUT THE AUTHOR

...view details