తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు బెంగళూరుకు చెందిన హేమంత్ గౌడ్ అనే భక్తుడు రూ.20లక్షల విరాళం ఇచ్చారు. ఈ సొమ్మును డీడీల రూపంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. మరో అజ్ఞాత భక్తుడు తితిదే బర్డ్ ఆసుపత్రికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. ఆ సొమ్ముతో ఆధునికమైన ల్యాబ్ ని ఏర్పాటు చేయాలని ఆయన ఈవోని కోరారు. దాత కోరిక మేరకు రూ. 5 కోట్ల వ్యయంతో దక్షిణ భారతదేశంలోనే అధునాతనమైన సిటి స్కాన్, ఎక్స్ రే, ల్యాబ్ పరికరాలు కోనుగోలు చేయాలని ధర్మారెడ్డి అధికారులకు సూచించారు.
తితిదే బర్డ్ ఆసుపత్రి, ఎస్వీబీసీ ట్రస్టుకు దాతల సాయం - latest news in chittor district
ఓ అజ్ఞాత భక్తుడు తితిదే బర్డ్ ఆసుపత్రికి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. మరో భక్తుడు శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. డీడీల రూపంలో ఈ సొమ్మును అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
ఎస్వీబీసీ ట్రస్టుకు దాతల సాయం