చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలో బుధవారం పదో తరగతి బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ కేసును 48 గంటల్లో పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన నిందితులు బి.మధుకర్, రఘునాథ్లను బెట్టకొండ క్రాస్ వద్ద కారుతో సహా అరెస్టు చేసినట్లు ములకలచెరువు సీఐ సురేష్ కుమార్ తెలిపారు. కేసును ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచారి అభినందించారన్నారు.
విద్యార్థినీ కిడ్నాప్ కేసులో నిందితులు అరెస్ట్ - News of girl kidnapping in Chittoor district
ఈ నెల 11న చిత్తూరు జిల్లా పెద్ద సముద్ర మండలంలో విద్యార్థిని కిడ్నాప్నకు గురైంది. ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ సురేష్ కుమార్ తెలిపారు.

విద్యార్థినీ కిడ్నాప్ కేసులో నిందితులు అరెస్ట్
Last Updated : Nov 13, 2020, 10:23 PM IST