ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోడీజిల్​ ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

పెట్రోడీజీల్​ ధరలకు వ్యతిరేకంగా తిరుపతిలో సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు రోజురోజుకూ తగ్గుతూ ఉంటే, కేంద్రం అధిక పన్నులు విధిస్తూ, పెట్రోధరలు పెరిగేలా చేస్తోందంటూ సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

cpi leaders protest for hick of petrol at tirupati
పెట్రోడీజిల్​ ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన

By

Published : Jun 20, 2020, 3:23 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతిలో పెట్రోడీజిల్​ ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. దేశంలో పెట్రోడీజిల్​ ధరలు పెరుగుతుండడం కేంద్ర ప్రభుత్వ దురుద్దేశపూర్వక చర్యేనని మండిపడ్డారు. నగరంలోని గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకూ ర్యాలీ చేపట్టిన సీపీఐ నాయకులు...డోలీలపై మనుషులను ఊరేగిస్తూ తమ నిరసన తెలియచేశారు.

అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు రోజురోజుకూ తగ్గుతూ ఉంటే... మన దేశంలో మాత్రం కేంద్రం అధిక పన్నులు విధిస్తూ, పెట్రోధరలు పెరిగేలా చేస్తోందంటూ సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:'సరిహద్దుల్లో తలెత్తే ఎలాంటి పరిస్థితికైనా వాయుసేన సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details