చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బీ. కొత్తకోటలో సీపీఐ ఆధ్వర్యంలో.. వలస కార్మికులు, విద్యుత్ వినియోగదారులు రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వలస కార్మికులను ఆదుకోవాలని.. అధిక విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులు, పేదల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మార్చుకోవాలన్నారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
సీపీఐ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల ధర్నా - కొత్తకోటలో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా వార్తలు
చిత్తూరు జిల్లా బీ. కొత్తకోటలో వలస కార్మికులు, విద్యుత్ వినియోగదారులు దర్నా చేపట్టారు. సీపీఐ ఆధ్వర్యంలో అధిక ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.

సీపీఐ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల ధర్నా