ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 14, 2020, 12:00 PM IST

ETV Bharat / state

కరోనా కేసుల కలకలం... అప్రమత్తమైన అధికారులు

చిత్తూరు జిల్లా బి.కొత్తపేటలో కరోనా కేసులు నమోదు కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశారు.

కరోనా కేసుల కలకలం..అప్రమత్తమైన అధికారులు !
కరోనా కేసుల కలకలం..అప్రమత్తమైన అధికారులు !

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తపేటలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ వెళ్లొచ్చిన ఓ వస్త్ర వ్యాపారితో పాటు కుటుంబంలో భార్య, కుమార్తెకు కరోనా నిర్ధరణ అయింది. దీంతో అధికారులు ​అప్రమత్తమయ్యారు. కరోనా బాధిత కుటుంబం ఇంటి 500 మీటర్ల పరిధి వరకు రెడ్​జోన్​గా ప్రకటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశారు. రెడ్​జోన్ ప్రాంతంలో డీఎస్పీ రవిమనోహర్, వైద్యాధికారులు పర్యటించారు.

ABOUT THE AUTHOR

...view details