ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రయాణాల్లో జాగ్రత్త.. మాస్కులు పెట్టుకోవడం మరిచిపోకండి' - శ్రీకాళహస్తిలో కరోనా పై అవగాహన కార్యక్రమం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బస్సుల్లో ప్రయాణీకులకు కరోనా పై అవగాహన కల్పించారు

మాస్కులు ధరించాలని ప్రయాణీకులు సూచిస్తున్న పురపాలక కమిషనర్
మాస్కులు ధరించాలని ప్రయాణీకులు సూచిస్తున్న పురపాలక కమిషనర్

By

Published : Mar 31, 2021, 7:51 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాస్.... కరోనా పై ప్రయాణీకులకు అవగాహన కల్పించారు. మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు అధికమవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

శ్రీకాళహస్తికి అధిక సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తారు కాబట్టి కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విధిగా మాస్కులు ధరించాలన్నారు. పట్టణంలోని పాఠశాలలను తనిఖీ చేసిన కమిషనర్ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details