రానున్న తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికలో... పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ కోరారు. తిరుపతిలో నిర్వహించిన భాజపా కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. 'గుండె గుండెకు బీజేపీ' నినాదంతో సమష్టిగా కృషి చేయాలని సూచించారు. తిరుపతి ఎంపీ సీటు గెలిస్తే కేంద్రం ద్వారా జరిగే అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.
'తిరుపతి పార్లమెంటరీ ఉపఎన్నికలో సమన్వయంతో పనిచేయాలి' - తిరుపతి నేటి వార్తలు
తిరుపతిలో భాజపా కార్యకర్తల సమన్వయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ హాజరయ్యారు. రానున్న తిరుపతి పార్లమెంటరీ ఉపఎన్నికలో పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
!['తిరుపతి పార్లమెంటరీ ఉపఎన్నికలో సమన్వయంతో పనిచేయాలి' Coordination meeting of BJP workers in Tirupati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9800292-587-9800292-1607370507714.jpg)
తిరుపతిలో భాజపా కార్యకర్తల సమన్వయ సమావేశం